ఇల్లంతకుంట,జూన్ 9 (మన వార్త ప్రతినిధి):
మహిళా సంఘాల ఆర్థిక సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభకు ఇల్లంతకుంట మండల సమాఖ్య ప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు.మండల సమాఖ్యకు కేటాయించిన ఆదర్శ మండల సమాఖ్య ఆర్టీసీ బస్సులో మండల,గ్రామ సమాఖ్యల అధ్యక్షులు,వివోఏలు,సభ్యులు సభకు హాజరయ్యారు.ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మండల మహిళా సమాఖ్యలకు బస్సుల పంపిణీ,వడ్డీ రాయితీ చెక్కుల పంపిణీ,వడ్డీ లేని రుణాల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతూ జారీ చేసిన జీవో విడుదల వంటి కార్యక్రమాలు చేపట్టారు.మహిళా సంఘాల బలోపేతం,స్వయం ఉపాధి అవకాశాల విస్తరణ,ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సభలో వివరించారు.ఈ కార్యక్రమంలో ఏపీఎం కుమారస్వామి,మండల సమాఖ్య అధ్యక్షురాలు సౌమ్య,కార్యదర్శి మమత,కోశాధికారి సరస్వతి,అకౌంటెంట్ మంజుల,ఆశ కార్యకర్తలు,పోలీసు సిబ్బంది,ఆపరేటర్ శ్రీనివాస్,వివో అధ్యక్షులు,వివోఏలు,సభ్యులు పాల్గొన్నారు.
Telangana
మహిళా శక్తి సభకు కదిలిన సమాఖ్యలు..
Quick Summary:
రాజు ఇల్లంతకుంట మన వార్త