సిరికొండ, జూన్ 18, (మన వార్త ప్రతినిధి):
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ జవహార్ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ (11వ తరగతి) ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షలో సత్యశోధక్ పాఠశాలకు చెందిన విద్యార్థిని ఈ. లక్ష్మి సహస్ర ప్రతిభ కనబరిచి ఎంపికైంది.పదవ తరగతిలో 562 మార్కులు సాధించిన లక్ష్మి సహస్ర, జవహార్ నవోదయ విద్యాలయ సమితి నిర్వహించిన ప్రవేశ ప్రక్రియలో అర్హత సాధించి ఇంటర్మీడియట్ విద్యకు ఎంపిక కావడం పాఠశాలకు గర్వకారణమని ప్రిన్సిపాల్ ఆర్. నర్సయ్య తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థిని సాధించిన విజయం ఆమె కృషి, పట్టుదల, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం మరియు తల్లిదండ్రుల ప్రోత్సాహానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని క్రమశిక్షణతో విద్యాభ్యాసం కొనసాగించి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.లక్ష్మి సహస్ర విజయంపై పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
Telangana
జవహార్ నవోదయలో ఇంటర్ ప్రవేశం సాధించిన సత్యశోధక్ విద్యార్థిని లక్ష్మి సహస్ర... -అభినందించిన ప్రిన్సిపాల్ ఆర్. నర్సయ్య...
Quick Summary:
కామారెడ్డి, మనవార్త