అల్వాల్ పరిధిలో కొత్త మురుగునీటి పైపుల ఏర్పాటుకు మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి వినతి.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జూన్ 9మన వార్త : అల్వాల్ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో నెలకొన్న మురుగునీటి సమస్యలను పరిష్కరించేందుకు మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ జనరల్ మేనేజర్ సునీల్ను కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ముత్యం రెడ్డి నగర్, నాగి రెడ్డి కాలనీ, ఎగ్జిక్యూటివ్ కాలనీ, దినకర్ నగర్, మాధవి నగర్, అయ్యర్ బస్తీ, రాజీవ్ వీకర్ సెక్షన్ ప్రాంతాల్లో కొత్త మురుగునీటి (సీవరేజ్) పైపులైన్ల మంజూరు చేసి, వెంటనే పనులు చేపట్టాలని కోరారు. సంబంధిత కాలనీల్లో చాలాకాలంగా మురుగునీటి పారుదల సమస్యలు కొనసాగుతున్నాయని, దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సీవరేజ్ పనులకు తక్షణమే పరిపాలనా అనుమతులు మంజూరు చేసి, పనులను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో పెండింగ్లో ఉన్న తాగునీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థకు సంబంధించిన వివిధ అభివృద్ధి పనులపై కూడా జీఎంతో విస్తృతంగా చర్చించారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందేలా సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
స్థానిక ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని, అభివృద్ధి పనుల అమలుపై నిరంతరం అధికారులతో సమన్వయం కొనసాగిస్తామని మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
Medchal -Malkajgiri District
అల్వాల్ పరిధిలో కొత్త మురుగునీటి పైపుల ఏర్పాటుకు మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి వినతి.
Quick Summary:
అల్వాల్ మన వార్త ప్రతినిధి: అంతోని
